గురుకుల పాఠశాలలో మరోసారి విద్యార్థినుల అదృశ్యం..
నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో ఘటన
నెల్లూరు జిల్లా: పదో తరగతి చదివే ముగ్గురు విద్యార్థినులు అదృష్యమైన ఘటన నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 7గంటల నుంచి అంకిత, మల్లిక జ్యోతి, నాగమణి అనే ముగ్గురు బాలికలు కనిపించటం లేదని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన విద్యార్థినులు రాపూరు, కలువాయి, పొదలకూరుకు చెందినవారని పాఠశాల సిబ్బంది తెలిపారు. గతంలోనూ ఈ పాఠశాల నుంచి విద్యార్థులు కనిపించకుండా పోవటం గమనార్హం.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox