తెలంగాణలో పోటీపై పవన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో అలా చేయబోతున్న పవన్

ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉన్న జనసేన అధినేత తెలంగాణ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు. తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు.

కాగా ఇవాళ కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ తన వారాహితో నారసింహ క్షేత్రాలను సందర్శించుకోవడానికి బయలుదేరడం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ను అధికారంలోకి రాకుండా చేస్తామన్న పవన్.. అవసరమైతే ఏ పార్టీతో అయినా పరిస్థితికి అనుగుణంగా పొత్తుకు సిద్ధం అని ప్రకటించారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం