టీఎస్‌ఆర్టీసీ ‘ఏమ్ 2 పీఎమ్’ అనే ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌ ప్రారంభం

కొత్త సర్వీస్ ను ప్రారంభించిన టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పార్సిల్ సర్వీస్ వేగవంతమైన డెలివరీ కోసం ‘AM 2 PM’ అనే ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్‌లు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంటాయని సజ్జనార్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ లాంఛనంగా ప్రారంభించారు. 

మధ్యాహ్నం 12 గంటలలోపు పార్శిల్ పికప్ పెడితే, అదే రోజు రాత్రి 9 గంటలకు అది గమ్యస్థానానికి చేరుకుంటుంది. పికప్‌ను మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల మధ్య ఉంచినట్లయితే, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు డెలివరీ చేయబడుతుందని సజ్జనార్‌ తెలిపారు. ప్రస్తుతానికి 1 కిలోల పార్శిల్ (రూ. 5,000 వరకు విలువ) మాత్రమే కొత్త సర్వీస్‌ కింద కవర్ చేయబడుతుందని,

ప్రతిస్పందన ఆధారంగా ఇతర రాష్ట్రాలు మరియు టైర్-III నగరాలకు సేవను విస్తరించడానికి అదనంగా 5 కిలోలు అందుబాటులోకి తీసుకువస్తన్నట్లు తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ కొరియర్ ధర రూ. 99గా నిర్ణయించబడింది. టీఎస్‌ఆర్టీసీ 364 ఏజెంట్ల ద్వారా ఈ సేవలను వినియోగదారులకు వేగంగా అందిస్తోంది. పార్శిళ్లను డెలివరీ చేసేందుకు మొత్తం 192 ప్రత్యేక వాహనాలను కేటాయించామని సజ్జనార్ తెలిపారు. పౌరులు ‘AM2PM’ సేవను పొందడానికి, మరిన్ని వివరాల కోసం +9154680020 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox