బకాయిలన్నీ క్లియర్ చేయాలని కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

అనేక ముఖ్యమైన పథకాలు నిర్వీర్యం అయ్యాయని ఉత్తమ్ ఆవేదన

హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు భారీ బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక ముఖ్యమైన పథకాలు నిర్వీర్యం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని కేటాయింపులు చేయాలని ఆయన పేర్కొన్నారు.  పంట రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని ఆయన కోరారు. పంట రుణాల కోసం రూ.20 వేలు కోట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 4 వేల కోట్లు, విద్యార్థులకు రూ.3 వేల కోట్లు విడుదల చేయాలన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న హామీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. 2023- -ది24 బడ్జెట్‌లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, పంట రుణమాఫీ, మహిళా స్వయం సహాయక సంఘాల బకాయిలను సింగిల్ టేక్‌లో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులను నిర్ధారించాలని లేఖలో ఆయన కోరారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox