హైదరాబాద్: హైదరాబాద్ లో క్యూఫివర్ వణికిస్తోంది. హైదరాబాద్లో 250 మంది మాంసం విక్రయించే వారికి వైద్య పరీక్షలు చేయగా, ఐదుగురిలో 'క్యూ ఫీవర్' గుర్తించినట్లు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్(ఎన్ఆర్సిఎం) నిర్ధారించింది. కొత్త రకం జ్వరం 'క్యూ ఫీవర్' విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
ప్రజలు కబేళాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఈ 'క్యూ ఫీవర్' అనేది మేకలు, గొర్రెలు, పశువుల నుంచి సంక్రమించే అంటు వ్యాధి. ఇది జంతువుల్లో కనిపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి గాలి ద్వారా కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంది.
క్యూ ఫీవర్తో బాధపడే వ్యక్తులకు జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పితో పాటు ఫ్లూ వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వ్యాధి కొద్ది మందికే సోకింది. దీని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పరిశుభ్రత పాటించాలి. ఈ వ్యాధి మొదట పశుకాపారులకు వచ్చి తర్వాత ఇతరులకు వ్యాపించే అవకాశాలుంటాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox