అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో భారీ పేలుడు.. ఒకరు మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అచ్యుతాపురం సెజ్ లోని లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో ఈ పేలుడు జరిగింది.
రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాముటిన ఘటానాస్థలికి చేరుకున్నారు. మంటలార్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox