కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారం: మోదీ

విశ్వనాథ్ సినీ ప్రపంచంలోనే ఒక దిగ్గజం

న్యూదిల్లీ: ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.  సినీ ప్రపంచంలో విశ్వనాథ్ ఒక దిగ్గజమని కొనియాడారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు మోదీ  తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం