భారీగా తగ్గిన టీవీ,మెుబైల్ ధరలు.. పెరగనున్న అమ్మకాలు!

ఎలాక్ట్రానికి ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు

న్యూదిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాక్ట్రానికి ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించినందున  స్మార్ట్‌ఫోన్, టెలివిజన్ ధరలు భారీగా తగ్గాయి. ఇది ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యాపారులకు వరంగా మారనుంది,రాబోయే రోజుల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. వినియోగదారులకు ఇప్పుడు ఎక్కువ డీల్స్ అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

సుంకం ఎక్కువగా ఉండడంతో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల ఎలక్ట్రానిక్స్ మార్కెట్ గతేడాదిలో వాటి ఆమ్మకాలు అంతంత మాత్రంగానే జరిగాయి. కానీ ఇప్పుడు కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం తగ్గింపు ఎలక్ట్రానిక్ అవుట్‌లెట్‌ల విక్రయానికి వినియోగదారులు ఆసక్తి చూపింస్తారని వ్యాపారులు భావిస్తు్న్నారు . స్మార్ట్‌ఫోన్, టీవీ ధరలను తగ్గించడం వల్ల వినియోగదారులకు మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వ్యాపారులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం