గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 352 ఒప్పందాలు చేసుకున్నాం: అమర్నాథ్
కొత్తగా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న అమర్నాథ్
విశాఖపట్నం: పరిశ్రమల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తొలుత రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తే అంతకుమించి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ తరుణంలోనే పరిశ్రమల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. సదస్సు వల్ల ఏపీ సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయి. సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారు అని అమర్నాథ్ తెలిపారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox