ఆధార్ అప్డేషన్ కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు
ఆధార్ అప్ డేషన్ 3 నెలలు ఉచితం
హైదరాబాద్: ఆధార్ అప్ డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ కొంత వెసులుబాటు కల్పించింది. ఆధార్ అప్ డేషన్ కోసం ఎలాంటి ఫీజూ వసూలు చేయొద్దని నిర్ణయించింది. అయితే, ఈ అవకాశం 3 నెలల వరకు మాత్రమేనని తేల్చిచెప్పింది. కాగా, ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వసూలు చేస్తోంది. తాజాగా ఈ నిర్ణయం తీసుకుని మూడు నెలల పాటు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
యూఐడీఏఐ అధికారుల ప్రకారం.. మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ అప్ డేషన్ ఉచితంగా చేసుకోవచ్చు. అవసరమైన గుర్తింపు పత్రాలతో ఆధార్ పోర్టల్ ద్వారా ఈ అప్ డేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతరత్రా సేవలకు చార్జీలు చెల్లించాల్సిందే. ఉచిత సదుపాయం కేవలం ఆధార్ అప్ డేషన్ కు మాత్రమేనని అధికారులు వివరించారు. ఉచిత అప్ డేషన్ గడువు ముగిశాక రూ.50 చెల్లించి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox