రాహుల్ సిప్లిగంజ్‌ను సన్మానించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అవార్డును తీసుకున్న సందర్బంగా హైదరాబాద్ చేసుకున్న సిప్లిగంజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు . ఆస్కార్ అవార్డుతో తెలుగు వారి సత్తా చాటారని కొనియాడారు .

హైదరాబాద్ :ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) చిత్రంలోని నాటు నాటు పాటతో ఆస్కార్‌ అవార్డ్‌(Oscar Award) వచ్చిన విషయం తెలిసిందే . ఇందులో రాహుల్ సిప్లిగంజ్ భాగస్వామ్యం ఉన్నదీ . అవార్డును తీసుకున్న సందర్బంగా హైదరాబాద్ చేసుకున్న సిప్లిగంజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు . ఆస్కార్ అవార్డుతో తెలుగు వారి సత్తా చాటారని కొనియాడారు . సిప్లిగంజ్ ను శాలువాతో సన్మానించారు . అభినందనలు తెలిపారు . ఆస్కార్ అవార్డు పొందిన మొదటి తెలుగు చిత్రం అని  మంత్రి సంతోషం వ్యక్తం చేశారు .భవిష్యత్‌లోనూ మరింత తన గాత్రంతో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
95 వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు నాటు పాట రాసిన చంద్రబోస్‌, సంగీతమందించిన కీరవాణికి ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రదానంలోనూ రాహుల్‌ సిప్లిగంజ్‌ పాల్గొని పాటను వినిపించారు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం