ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించాలి : మంత్రి హరీష్ రావు
ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించాలని మంత్రి హరీష్ రావు అన్నారు
సిద్దిపేట: ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించాలని మంత్రి హరీష్ రావు అన్నారు ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు వైద్యులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రూ.40 లక్షలతో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కిట్స్ పంపిణీ ప్రక్రియను చేపట్టారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .. ఫైలేరియా వ్యాధిగ్రస్తులను బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ప్రభుత్వం గుండెల్లో ఆదుకుంటుందని ఎవరు ఆధర్యపడొద్దని అన్నారు . వీరికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఫైలేరియాతో బాధ పడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8 వేల 121 మందికి పైగా ఫైలేరియా బాధితులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నట్టు తెలిపారు .
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox