ఈ జిల్లాలకు నేడు వర్ష సూచన..!
రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులా గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కరిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. శుక్రవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇవాళ్టి ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ, హనుమకొండ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. మరో వైపు పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox