రేపటి నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు
ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది.
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సెషన్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ముఖ్య నేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. మరో విషయం ఏంటంటే.. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 20న మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox