తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేశాయి : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

 హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్  అన్నారు. మోడీ మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉన్నాయని కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు మీద మోడీ తన అక్కసు వెళ్లగక్కడం, అవమానకరంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని ఆయన చెప్పారు. అంతేకాదు చారిత్రక వాస్తవాల పట్ల మోడీ నిర్లక్ష్య ధోరణికి అతడి మాటలు అద్దం పడుతున్నాయని మంత్రి తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా నిర్విరామంగా కొట్లాడరని, చివరకు 2014 జూన్ 2వ తేదీన రాష్ట్రం సాకారమైందనే విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు రాష్ట్ర సాధన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారని, ముఖ్యంగా తెలంగాణ యువత పాత్ర మరువలేనిదని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మనం నిర్వహించుకోలేదనడం పూర్తి అవాస్తవం.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox