తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా..
:తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు(డిఎస్సి) వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ :తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు(డిఎస్సి) వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు. నవంబరు 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సిండగా.. ఎన్నికలు ఉండడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ లో విద్యాశాఖ 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్సి) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox